టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్కు టాస్ ఏమాత్రం కలిసి రావడం లేదు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల్లో టాస్ ఓడిన పంత్.. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న నాలుగో మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మరోసారి టాస్ నెగ్గిన సఫారీ సారధి టెంబా బవుమా మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు.
అలాగే తమ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నట్లు చెప్పాడు. రబాడ, పార్నెల్, రీజా హెండ్రిక్స్ ఆడటం లేదని చెప్పిన బవుమా.. వారి స్థానాల్లో డీకాక్, జాన్సెన్, ఎన్గిడీ ఆడుతున్నాట్లు తెలిపాడు. భారత జట్టులో ఎలాంటి మార్పులూ లేవని పంత్ వెల్లడించాడు.
భారత జట్టు: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
సౌతాఫ్రికా: క్వింటన్ డీకాక్, టెంబా బవుమా (కెప్టెన్), డ్వెయిన్ ప్రిటోరియస్, రాసీ వాన్ డర్ డస్సెన్, హెన్నిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడీ, ఆన్రిచ్ నోర్జీ, తబ్రయిజ్ షంసీ
🚨 Toss Update 🚨
South Africa have elected to bowl against #TeamIndia.
Follow the match ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/2gR3HYGQiG
— BCCI (@BCCI) June 17, 2022