గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. యువపేసర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ కొత్త బంతితో చెలరేగడంతో 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో మార్క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహరాజ్ (41) పోరాడి ఆ జట్టు పరువు నిలిపారు. వరుసగా కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఎక్కడా మంచి భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది.
కెప్టెన్ బవుమా (0), డీకాక్ (1), మిల్లర్ (0), స్టబ్స్ (0), రైలీ రూసో (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో మార్క్రమ్, పార్నెల్ కాసేపు నిలబడ్డారు. మార్క్రమ్ అవుటైన తర్వాత వచ్చిన కేశవ్ మహారాజ్ ఆకట్టుకున్నాడు. రబాడ (7 నాటౌట్)ను ఒక ఎండ్లో ఉంచి అతను జట్టు స్కోరుబోర్డును నడిపించాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేస్తాడని అనుకుంటున్న సమయంలో 20వ ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. కాగా, నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.
Innings Break!#TeamIndia bowlers put on a show here in the 1st T20I as they restrict South Africa to a total of 106/8 on the board.
Scorecard – https://t.co/yQLIMooZxF #INDvSA @mastercardindia pic.twitter.com/v2K9K1iQ0C
— BCCI (@BCCI) September 28, 2022