టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. గువాహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సపారీ కెప్టెన్ టెంబా బవుమా.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దీంతో పిచ్ను కప్పి ఉంచారు.
దానికి తోడు పిచ్లో పగుళ్లు కూడా ఉండటంతో మ్యాచ్ ఆరంభంలో బౌలర్లకు పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అనంతరం స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని రోహిత్ శర్మ తెలిపాడు. తొలి టీ20లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. సఫారీ జట్టులో షంసీ స్థానంలో ఎన్గిడీ ఆడుతున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
సౌతాఫ్రికా జట్టు: క్వింటన్ డీకాక్, టెంబా బవుమా (కెప్టెన్), రైలీ రూసో, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, ఆన్రిచ్ నోర్జీ, లుంగి ఎన్గిడీ
Huddle Time! 👍 👍#TeamIndia | #INDvSA pic.twitter.com/JTJhZYKrbb
— BCCI (@BCCI) October 2, 2022