ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ (60) తప్ప మిగతా బ్యాటర్లెవరూ నిలబడలేకపోయారు.
సూర్యకుమార్ యాదవ్ (13), రిషభ్ పంత్ (14), హార్దిక్ పాండ్యా (0), దీపక్ హుడా (16) పరుగులు మాత్రమే చేశారు. చివరి ఓవర్లో నాలుగో బంతికి రెండు పరుగులు చేసే ప్రయత్నంలో కోహ్లీ అవుటయ్యాడు. ఆ తర్వాత రవి బిష్ణోయి (8 నాటౌట్) ఆడిన రెండు బంతులకు పాక్ ఫీల్డర్ల తప్పిదాలతో బౌండరీలు వచ్చాయి.
దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. నసీం షా, మహమ్మదర్ హస్నయిన్, హారిస్ రవూఫ్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Innings Break!
54-run partnership from the openers and a well made 60 from Virat Kohli propels #TeamIndia to a total of 181/7 on the board.
Scorecard – https://t.co/Yn2xZGTWHT #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/0gyWwHHIv1
— BCCI (@BCCI) September 4, 2022