భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. బాబర్ ఆజమ్ (10) అవుటైన కాసేపటికే మరో కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన పవర్ప్లే చివరి ఓవర్లో షార్ట్ బంతిని అంచనా వేయలేకపోయిన జమాన్.. భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయకముందే పెవిలియన్ బాటపట్టాడు.
చాలా చిన్నగా బ్యాటును తాకిన బంతిని కీపర్ దినేష్ కార్తీక్ సులభంగా అందుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో తొలి పవర్ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 43 పరుగులతో నిలిచింది.