పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ పంపిన అతను.. తన రెండో ఓవర్లో ప్రమాదకర మహమ్మద్ రిజ్వాన్ (4) అవుట్ చేశాడు. అతను వేసిన నాలుగో ఓవర్లో తొలి బంతి.. మసూద్ బ్యాటుకు తగిలి బ్యాటర్ వెనకగా బౌండరీ వెళ్లింది. మరుసటి బంతికి అతను సింగిల్ తీశాడు.
తర్వాతి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఒక బంతి గాల్లోకి లేచింది. కానీ కోహ్లీ వేగంగా రియాక్ట్ అయినా కూడా బంతి వరకు చేరుకోలేకపోయాడు. ఆ మరుసటి డెలివరీలో అర్షదీప్ షార్ట్ బాల్ వేశఆడు. దాన్ని పుల్ చేసేందుకు ప్రయత్నించిన రిజ్వాన్ విఫలమయ్యాడు. దీంతో డీప్ ఫైన్ లెగ్లో ఉన్న భువనేశ్వర్ సులభమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్ (19 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఆ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దర్నీ కోల్పోయి కష్టాల్లో పడింది.