క్రికెట్లో అత్యంత పెద్ద వైరం భారత్, పాకిస్తాన్ మధ్యనే. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు ఆదివారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడతాయి. అయితే ఈ మెగా టోర్నీ ముందు రెండు జట్లకు స్టార్ పేసర్లు దూరమయ్యారు. భారత్కు బుమ్రా, హర్షల్ దూరమవగా.. పాక్కు షహీన్ అఫ్రిదీ దూరమయ్యాడు.
ఈ క్రమంలో అఫ్రిదీ ఆడటం లేదని తెలిసిన తర్వాత భారత్ ఊపిరి పీల్చుకుంటుందని పాక్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ ఇటీవలే అన్నాడు. ఇప్పుడు మరో పాక్ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్ కుడా అవే కామెంట్లు చేశాడు. ఈ సందర్భంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బారత టాపార్డర్ను కూల్చిన మహమ్మద్ ఆమిర్ను కూడా ప్రస్తావించాడు.
‘‘ఇండియాకు చాలా ఊరట దొరికింది. ఆమిర్ ఆ జట్టును ఎలా ఓడించాడో, షహీన్ ఏం చేశాడో మనకు తెలుసు. అదొక్కటే వాళ్లకున్న ప్రమాదం. టాపార్డర్ త్వరగా అవుటైతే భారత్ ఓడిపోతుంది. ఎందుకంటే కీలకమైన వికెట్లు కోల్పోయిన తర్వాత.. ఫామ్లో లేని కోహ్లీపై మరింత ఒత్తిడి పడుతుంది. అప్పుడు అతను కూడా సరిగా ఆడలేడు’’ అని జావెద్ అన్నాడు. శనివారం నాడు అఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే గ్రూప్-ఏ మ్యాచ్తో ఆసియా కప్ ప్రారంభం అవుతుంది.