టీ20 ప్రపంచకప్లో న్యూజిల్యాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. బుధవారం నాడు జరిగే తొలి టీ20 మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్పై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా మాట్లాడాడు.
జైపూర్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని, కానీ మంచు ప్రభావం కూడా బాగా ఉండొచ్చని చోప్రా చెప్పాడు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుందని అన్నాడు. అలాగే కివీ ఓపెనర్ల కన్నా కూడా భారత ఓపెనర్లే ఎక్కువ పరుగులు చేస్తారని ఊహించాడు. అయితే టీమిండియా ఓపెనింగ్ జోడీగా రాహుల్, రోహిత్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచకప్లో ఎదురైన ఓటమికి పగ తీర్చుకోవాలని టీమిండియా చూస్తుండగా.. పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి, విలియమ్సన్ లేకపోవడం వంటి ప్రతికూలతల మధ్య న్యూజిల్యాండ్ జట్టు బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టుకు సీనియర్ పేసర్ టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నాడు.