టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఫామ్లో ఉంటే ఎప్పుడు ఫామ్లోకి వస్తాడని, ఫామ్లోకి వస్తే అతన్ని ప్రత్యర్థులు ఎలా అడ్డుకుంటారని అడుగుతూనే ఉంటారు. భారత్తో 3 టీ20ల సిరీస్ కోసం వచ్చిన ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ను కూడా విలేకరులు ఇదే ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన ఫించ్.. కోహ్లీని తాము ఎప్పుడూ తక్కువగా అంచనా వేయబోమని స్పష్టం చేశాడు.
‘కోహ్లీని తక్కువ అంచనా వేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. 15 సంవత్సరాలుగా తను ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాడినని కోహ్లీ నిరూపించుకుంటూనే ఉన్నాడు. పర్టిక్యులర్గా టీ20 క్రికెట్లో తన ఆటను ఎంతో అభివృద్ధి చేసుకున్నాడు. ఇంత సుదీర్ఘకాలం తన ఆటను అభివృద్ధి చేసుకున్న విరాట్ను ఎదుర్కోవాలంటే చాలా కష్టపడి, అత్యుత్తమంగా ప్రిపేర్ అవ్వక తప్పదు’ అని చెప్పాడు. అసలు అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు చేయడమేంటని? అది ఎంత నమ్మశక్యంకాని ఫీట్? అని ఫించ్ అడిగాడు.