ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (69) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలో కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) విఫలమైనా.. విరాట్ కోహ్లీ (39 నాటౌట్) అండగా సూర్యకుమార్ ధాటిగా ఆడాడు.
ఈ క్రమంలోనే ఆడమ్ జంపా వేసిన 13వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. వీటితో తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. సూర్య ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత స్కోరుబోర్డు పరుగులుపెట్టింది. ఈ క్రమంలోనే 13 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 122/2 స్కోరుతో నిలిచింది. ఆ మరుసటి ఓవర్లో కూడా సిక్స్, ఫోర్ బాదిన సూర్య.. చివరి బంతికి మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యాడు. గ్రీన్ వేసిన బంతిని ఆడబోయి ఫించ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.