భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు మరో వికెట్ కోల్పోయింది. టపటపా వికెట్లు పడుతుండటంతో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టీవ్ స్మిత్ (9)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని ముందుకొచ్చి బాదేందుకు స్మిత్ ప్రయత్నించాడు.
అయితే అతను బంతిని మిస్ అవడంతో.. దాన్ని అందుకున్న దినేష్ కార్తీక్ వికెట్లను కూల్చాడు. దీంతో స్మిత్ స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్ మీదనే ఆ జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది.