భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో పంత్ను పక్కనపెట్టిన టీం మేనేజ్మెంట్ ఫినిషర్ దినేష్ కార్తీక్కు అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా జట్టులో కామ్ గ్రీన్ ఓపెనింగ్ చేస్తున్నట్లు ఫించ్ తెలిపాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లీస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్
🚨 Toss Update 🚨
Australia have elected to bowl against #TeamIndia in the first #INDvAUS T20I.
Follow the match 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/jxRYDRl9Bk
— BCCI (@BCCI) September 20, 2022