నిర్ణయాత్మక మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. సీనియర్లు స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్ వెంటవెంటనే అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన జోష్ ఇంగ్లిస్ (24) అవుటయ్యాడు. అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి రూమ్ తీసుకొని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రోహిత్ పట్టేశాడు. దీంతో 115 పరుగుల వద్ద ఆ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది.
ఇంగ్లిస్ అవుటవడంతో మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచుల్లో ధాటిగా ఆడిన అతను ఆసీస్ ఇన్నింగ్స్ను ఆదుకుంటాడని భావించగా.. అక్షర్ అతన్ని డకౌట్ చేశాడు. అక్షర్ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన వేడ్.. బంతిని సరిగా జడ్జ్ చేయలేకపోయాడు. దీంతో బంతి నేరుగా అక్షర్ వైపు వచ్చింది. వెంటనే రియాక్ట్ అయిన అతను ముందుకు దూకి మరీ క్యాచ్ పట్టేయడంతో వేడ్ (1) నిరాశగా పెవిలియన్ చేరాడు.