భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ (22)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. నాలుగో ఓవర్లో బంతి అందుకున్న అక్షర్.. మూడో బంతికి ఫించ్ను పెవిలియన్ చేర్చాడు. అక్షర్ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదేందుకు ఫించ్ ప్రయత్నించాడు. అయితే అక్షర్ వేసిన బంతి లైన్ను మిస్ అవడంతో అది వికెట్లను కూల్చింది. దీంతో ఆసీస్ జట్టు 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫించ్ పెవిలియన్ చేరడంతో స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు.
Timber Strike, courtesy @akshar2026! 👏 👏
First success with the ball for #TeamIndia! 👌 👌
Follow the match 👉 https://t.co/ZYG17eC71l
#INDvAUS pic.twitter.com/frZylgZkyr— BCCI (@BCCI) September 20, 2022