భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (27 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. వీళ్లిద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో భారత పేసర్లు వెలవెలబోయారు.
పవర్ప్లే స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్.. భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆరోన్ ఫించ్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.