విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో భారీ స్కోరు చేసిన భారత్.. బౌలింగ్ దాడిని కూడా అద్భుతంగా ఆరంభించింది. భువనేశ్వర్ కుమార్ తను వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (0), రహ్మనుల్లా గుర్బాజ్ (0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన జజాయ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
అతను రివ్యూ కోరినా అంపైర్ నిర్ణయం మారలేదు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం జద్రాన్ సింగిల్ తీయగా.. రహ్మనుల్లా గుర్బాజ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆ జట్టు ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.