తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారిని 52,682 మంది భక్తులు దర్శించుకోగా 15,805 మంది తలనీలాలు సమర్పిం చుకు న్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా ఇవాళ తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు విధుల్లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించ వద్దని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి టీటీడీ భద్రతా సిబ్బందికి సూచించారు. లక్షలాదిగా వచ్చే భక్తులతో సహనంతో , స్నేహ పూర్వకంగా ప్రవర్తించాలని చెప్పారు. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ భద్రతా సిబ్బందితో సమావేశ మయ్యారు. సిబ్బంది పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణ తో పని చేసి టీటీడీ కి మంచి పేరు తేవాలని సూచించారు. భక్తుల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.