హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. డ్యామ్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 1089.6 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 82.734 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద వస్తోంది. డ్యామ్కు 15,680 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 18,244 క్యూసెక్కులుగా ఉన్నది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 696.175 అడుగుల మేర నీరుంది.