అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తండటంతో తుంగభద్ర డ్యాంకు వరద పెరిగింది. దీంతో 4 గేట్లు ఒక మీటర్ ఎత్తి దిగువకు 10,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 23,642 క్యూ సెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 23,162 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వ నాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు పోటెత్తిన వరద
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షం కురుస్తుండటంతో పాటు టీబీ డ్యాం వరద తోడవ డంతో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు భారీగా చేరుతోంది.
బుధవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 48,370 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 47,900 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 11 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 470 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.