హైదరాబాద్ : గోదావరి నదికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. భద్రచాలం వద్ద గంటగంటకు క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. మధ్యాహ్నం 3.30 గంటలకు వరకు గోదావరిలో నీటిమట్టం 43 అడుగలకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ములుగు జిల్లా వాడేజు వద్ద గోదావరిలో నీటిమట్టం పెరుగడంతో టేకులగూడెం వద్ద హైదరాబాద్ – భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి.