హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పీవీ శత జయంతి ఉత్సవాల చైర్మన్ కేశవరావును కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
అలాగే పీవీ కుటుంబ సభ్యులు, మిగతా ప్రజా ప్రతినిధులని ఆహ్వానించినట్లు మహేష్ బిగాల తెలిపారు. విగ్రాహావిష్కరణ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్య మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియాలో ఉన్న వివిధ భారత సంఘాలను కూడా ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.