నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా మునుగోడు మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వర్కాల మధుకర్, గౌరవ అధ్యక్షుడు గంజి భిక్షమయ్య, చేనేత సహకార సంగం అధ్యక్షుడు సంగిశెట్టి పరమేశం, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుడు కొంగరి వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అలాగే మీ అన్న వెంకట్ రెడ్డి ఎంపీగా ఇప్పుడు ఉన్నాడు కదామునుగోడు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమన్నారు.