అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి ముఖ్యతారలుగా నటిస్తున్న చిత్రం ‘జగమెరిగిన సత్యం’. తిరుపతి పాలే దర్శకుడు. విజయ్ భాస్కర్ నిర్మాత. ఈ చిత్ర మోషన్ పోస్టర్ను ఇటీవల నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో 1994లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అన్ని అంశాల మేళవింపుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం వుంది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్కుమార్ ఘటకల