న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటి వరకు 2.27లక్షల మంది గర్భిణులు కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చారని పేర్కొంది. తమిళనాడులో అత్యధికంగా 78,838 గర్భిణులకు టీకాలు తీసుకున్నారని చెప్పింది. తర్వాత ఏపీలో 34,228, ఒడిశాలో 29,821 మంది, మధ్యప్రదేశ్లో 21,842 మంది, కేరళలో 18,423, కర్ణాటకలో 16,673 మంది గర్భిణులకు తొలిడోసు వేసినట్లు పేర్కొంది.
టీకాలు వేసుకునేందుకు చాలా రాష్ట్రాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గర్భిణులకు మహమ్మారితో ప్రమాదం, టీకా తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలపై క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా వారిలో వ్యాక్సిన్ తీసుకోవాలా.. వద్దా అనే విషయం తెలుస్తోందని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో గర్భిణులకు టీకాలు వేసేందుకు ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. టీకాలు వేయడంలో ఆశా కార్యకర్తలు ముఖపాత్ర పోసిస్తున్నారని, గర్భిణులు, బాలింతలకు ఆయా ప్రాంతాల్లో టీకాలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొంది.