న్యూఢిల్లీ : ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 20 ఏండ్ల కాలేజ్ విద్యార్ధి రైల్వేట్రాక్పై కాళ్లు చేతులు తెగి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్న ఘటన తమిళనాడులోని తిరుత్తణిలో వెలుగుచసింది. వేరే మతానికి చెందిన బాలికను ప్రేమిస్తున్న మృతుడు రైల్వే ట్రాక్పై శవమై తేలాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సింగరాజపురం కాలనీకి చెందిన ధోనీశ్వరన్గా గుర్తించారు.
మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్పై మృతదేహాన్ని గుర్తించారు. బాధితుడు తిరుత్తణిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు చదువుతున్నాడు. యువకుడు కొద్దికాలంగా వేరే మతానికి చెందిన యువతితో ప్రేవ వ్యవహారం నడుపుతుండగా ఆమె తల్లితండ్రులు వీరి సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. బాధితుడి తల్లితండ్రులు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు శవమై తేలడంతో యువతి బంధువుల పాత్రపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి యువతి బంధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. యువకుడి మృతి ఆత్మహత్యా లేక హత్య అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.