ఢిల్లీ : ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అత్యంత ఖరీదైన వాచ్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడి నుంచి ఏడు అత్యంత ఖరీదైన వాచ్లను ఇతర విలువైన వస్తువులను సీజ్ చేశారు.
డైమండ్లు పొదిగిన గోల్డ్ బ్రాస్లెట్తో పాటు ఐఫోన్ 14 ప్రొ 256జీబీ స్మార్ట్ఫోన్ సహా ఇతర వస్తువులున్నాయి. ఖరీదైన వాచ్ల్లో ఓ వాచ్ ధర అత్యంత అధికంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. గోల్డ్, డైమండ్లతో పొదిగిన డిజైనర్ పీస్గా రూపొందిన వాచ్ను అక్టోబర్ 4న సీజ్ చేశారు. దుబాయ్ నుంచి భారత్కు చేరుకున్న వ్యక్తి నుంచి ఈ వస్తువులను సీజ్ చేశారు.
అడ్వాన్స్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏపీఐఎస్) ప్రొఫైలింగ్ ద్వారా నిందితుడిని పసిగట్టారు. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని సోదాలు జరపగా అత్యంత ఖరీదైన ఏడు రిస్ట్ వాచ్లు లభించాయి. మొత్తం రూ 28.17 కోట్ల విలువైన వస్తువులను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.