లక్నో : తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి తమ్ముడిని హత్య చేశాడు. తమ్ముడిని కడతేర్చిన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని ధనంజయ్ అలియాస్ పింటూ యాదవ్గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన తమ్ముడు శివ బహదూర్ తన భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో తాను అతడిని అంతమొందించానని విచారణలో నిందితుడు అంగీకరించాడు.
ఈనెల 10న తన తమ్ముడు నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపానని వెల్లడించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18న నిందితుడికి వివాహమైందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు మమ్మురం చేశామని పోలీసులు తెలిపారు.