ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబైలో సోమవారం సమావేశమైన ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినేతగా సీఎం షిండేను ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు. గతంలో ఠాక్రే ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ శివసేన నూతన జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో తీర్మానాన్ని షిండే వర్గం ఆమోదించింది.
ఎమ్మెల్యే దీపక్ కెసర్కర్ను పార్టీ ప్రతినిధిగా నియమించగా రాందాస్ కదమ్, మాజీ ఎంపీ ఆనంద్ రావు అద్సుల్ను శివసేన నేతలుగా నియమించారు. యశ్వంత్ జాదవ్, గులాబ్రావు పాటిల్, ఉదయ్ సామంత్, శరద్ పోంక్షే, తానాజీ సావంత్, విజయ్ నహతా, శివాజీరావు పాటిల్ను డిప్యూటీ నేతలుగా నియమించారు.
మహా వికాస్ అఘడి ప్రభుత్వం కూలిపోయేందుకు దారితీసిన పరిణామాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఈనెల 20న సుప్రీంకోర్టు విచారించనున్న నేపధ్యంలో శివసేన చీఫ్గా షిండేను రెబెల్ గ్రూపు ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే బలనిరూపణకు ముందే సీఎంగా వైదొలగడంతో జూన్ 30న మహారాష్ట్ర నూతన సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.