న్యూఢిల్లీ : ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటనలు చేపట్టడంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రపంచ టూరిజం డే శుభాకాంక్షలు..మీ ఖరీదైన విమానంలో సరదాగా ప్రపంచాన్ని చుట్టి రండి..సురక్షితంగా ప్రయాణించడని కాంగ్రెస్ మంగళవారం ట్వీట్ చేసింది.
Wish PM Modi a Happy #WorldTourismDay
Must be fun jet setting around the world in that expensive plane of yours! Fly safe pic.twitter.com/lY4kPIxnl9
— Congress (@INCIndia) September 27, 2022
ప్రధాని మోదీ ప్రస్తుతం జపాన్ మాజీ ప్రధాని షింజో అబె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టోక్యో సందర్శించారు. అంతకుముందు ఆయన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఆపై పలువురు ప్రపంచ నేతలతో కలిసి అబేకు నివాళులు అర్పించారు. ప్రపంచ పర్యాటక సంస్ధ పిలుపు మేరకు ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినం పాటిస్తున్న సంగతి తెలిసిందే.