గువహటి : ట్వంటీ20 మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ, స్టేడియంలో ప్రతిక్షణం ఉద్వేగం నెలకొంటుంది. అలాంటి వేళ ఏకంగా గ్రౌండ్లోకి పాము రావడం కలకలం రేపింది. స్దానిక బర్సపర స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి పాము రావడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
Snake also reached to watch the cricket match of India and South Africa at the stadium in Guwahati.#Guwahati #Cricket #snake #SnakeAtTheStadium #INDvsSA #INDvsSAT20I pic.twitter.com/cI4cP7FRy7
— Prateek Pratap Singh (@PrateekPratap5) October 2, 2022
భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పిచ్పై పామును ఆటగాళ్లు గుర్తించడంతో మ్యాచ్ను కొద్దిసేపు నిలిపివేశారు. పామును వేన్ పర్నెల్ గుర్తించగా మ్యాచ్ను నిలిపివేసిన సమయంలో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ముచ్చటించుకోవడం కనిపించింది. గ్రౌండ్ సిబ్బంది కర్రలు, బకెట్తో అక్కడికి చేరుకుని ఫీల్డ్ నుంచి పామును బయటకు తీసుకువెళ్లారు.
ఈ ఘటనతో వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ సహా పలువురు వీక్షకులు షాక్ తిన్నారు. నా మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయని స్నేక్ ఇమేజ్తో బిషప్ ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 2-0 లీడ్ను సాధించింది.