న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పునర్వ్యవస్ధీకరణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ కీలక రాష్ట్రం యూపీలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపడుతోంది. యూపీ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బ్రిజ్లాల్ ఖబ్రిని నియమించినట్టు పార్టీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
యూపీ కాంగ్రెస్ కమిటీకి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులను నియమించారు. నసీముద్దీన్ సిద్ధిఖి, అజయ్ రాయ్, వీరేంద్ర చౌధరి, నకుల్ దూబే, అనిల్ యాదవ్, యోగేష్ దీక్షిత్లను ప్రాంతీయ హెడ్లుగా నియమించారు.
కాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అజయ్ లల్లూ వైదొలగిన నేపధ్యంలో పార్టీ హైకమాండ్ తాజా నియామకాలను చేపట్టింది.