న్యూఢిల్లీ : మోటొరొలా భారత్లో న్యూ బడ్జెట్ స్మార్ట్ఫోన్ మోటో ఈ32ను లాంఛ్ చేసింది. ఐరోపా మోడల్తో పోలిస్తే మొటొరొలా మోటో ఈ32 భారత వెర్షన్ విభిన్నంగా ఉంది. మోటో ఈ32 మీడియాటెక్ హెలియో జీ37 చిప్సెట్తో 4జీబీ ర్యాం, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులో ఉంది.
ఒక వేరియంట్లోనే లభించే ఈ స్మార్ట్ఫోన్ రూ 10,499కి ఫ్లిప్కార్ట్లో లభిస్తోంది. మోటో లేటెస్ట్ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మోటో ఈ32 6.5 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్తో రూపొందిన ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్పై రన్ అవుతుంది.
50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సర్తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్తో మోటో ఈ32 కస్టమర్ల ముందుకొచ్చింది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరా ఉంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ 10డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.