ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అప్రమత్తంగా కదులుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 73.05 వద్ద ట్రేడ్ అవ్వగా… రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో తొలుత సూచీలు అప్రమత్తంగా కదిలాయి.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో సూచీలు క్షీణించాయి. దీంతో సెన్సెక్స్ 52,367.52 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,389.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,055.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 85.27 0.16శాతం పాయింట్లు క్షీణించి 52,147.16 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,712.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,733.60 వద్ద గరిష్టాన్ని, 15,642.55 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.12శాతం అంటే 18.80 పాయింట్లు క్షీణించి 15,671.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.