Nitish Kumar | 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని వచ్చిన వార్తలతో తాను షాక్ అయ్యాయని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. తనకు అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తాను ఉండబోవడం లేదని మరోమారు నొక్కి చెప్పారు. `నేను యువతరం భవిష్యత్ కోసం పని చేయాలని కోరుకుంటున్నా. నా కోసం నేనేం చేయడం లేదు` అని మంగళవారం చెప్పారు. గతంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫుల్పూర్ లోక్సభ స్థానం నుంచి నితీశ్ పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది.
ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిని తానేనన్న వార్తలను మరోమారు నితీశ్ కుమార్ తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటే దేశ ప్రధానిగా ఉత్తర భారతదేశంలో నితీశ్కుమార్ అభ్యర్థిత్వానికి విస్తృత మద్దతు లభిస్తుంది. కానీ, ఇప్పటికైతే అటువంటి ఆలోచనేదీ లేదని విపక్షాలు చెబుతున్నాయి.
దేశంలోని విపక్ష నేతలంతా 2024 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన తర్వాతే ప్రభుత్వం ఏర్పాటుపైనా, ప్రధాని ఎంపికపైనా నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు విపక్షాలను ఒకే వేదిక పైకి తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానని నితీశ్ చెప్పారు.