స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువు ఆఖరు
గడువు పొడిగింపునకు విజ్ఞప్తులు
నిన్నటివరకు 9,308 దరఖాస్తుల స్వీకరణ
సిటీబ్యూరో, మార్చి 30 : జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కొందరు, అవగాహన లేక మరికొందరు దరఖాస్తు చేసుకోక పోవడంతో గడువును మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.