IIT Madras Computer Science Course | ఐఐటీలో సీటు రావడం అంటే మామూలు విషయం కాదు !! ఎంతో కష్టపడితే కాని అందులో సీటు రాదు ! కొంతమంది కష్టపడినా నాణ్యమైన విద్య దక్కకపోవడం వల్ల కూడా జేఈఈ వంటి ఎంట్రన్స్ టెస్ట్లో సరైన స్కోర్ చేయలేక సీటు పొందలేకపోతుంటారు. అలాంటి వాళ్లకు ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఐటీ క్యాంపస్లో చదవాలన్న ఆశ ఉండి సీటు దక్కకపోవడంతో ఏదో ఇన్స్టిట్యూట్లో చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తోంది ఐఐటీ మద్రాస్. తమ క్యాంపస్లోని కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రొఫెసర్లు చెప్పిన క్లాసులు, ఇతర మెటీరియల్ను దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో చదువుకునే విద్యార్థి అయినా సరే ఉచితంగా యాక్సెస్ చేసుకునే సదుపాయం కల్పించింది.
ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్ఛర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, అల్గారిథమ్లపై కోర్ కంప్యూటర్ సైన్స్ కోర్సులను ఎవరైనా యాక్సెస్ చేసుకునేందుకు ఐఐటీ మద్రాస్ వీలు కల్పించింది. ఇందుకోసం http://nsm.iitm.ac.in/cse/ పోర్టల్ను అందుబాటులో ఉంచింది. కరోనా సమయంలో విద్యార్థులకు చెప్పిన లెక్ఛర్స్కు సంబంధించిన యూట్యూబ్ రికార్డింగ్లను ఇందులో పొందుపరిచింది. విద్యాసంస్థలు, విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ కోర్సులను ఆన్లైన్లో యాక్సెస్ చేసుకోవచ్చని తెలిపింది.
కోర్ సబ్జెక్టులకు సంబంధించిన కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంతో పాటు సులువుగా దాన్ని నేర్చుకునేందుకు ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్లకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఐఐటీలో చదవలేని విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సహాయం చేసే ఉద్దేశ్యంతోనే ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రూపేశ్ నస్రే తెలిపారు. ఐఐటీ మద్రాస్లో విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలు అన్నింటినీ అందరూ యాక్సెస్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఐఐటీ అబ్బాయి.. ఐఐటీ అమ్మాయి.. ఇద్దరూ కలిశారు.. అద్భుతం సాధించారు”
అక్టోబర్ 10 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు.. అకడమిక్ క్యాలెండర్ను సవరించిన ఏఐసీటీఈ”
“బీటెక్ స్టూడెంట్స్కు JNTU గుడ్ న్యూస్.. ఏడాది బ్రేక్ తీసుకుని మళ్లీ చదువుకోవచ్చు”