నిర్మల్ : జిల్లాలోని భైంసాలో ఆదివారం జరిగిన అల్లర్ల సంఘటన స్థలాలను ఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భైంసా సోమవారం నుంచి పూర్తిగా పోలీసుల అదుపులో ఉందన్నారు. ఇప్పటివరకు 22 మందిపై 19 కేసులను నమోదు చేసి రిమాండ్కి పంపించామని వివరాలను వెల్లడించారు. ఇంకా సీసీ, వీడియో ఫుటేజ్ ఆధారంగా నేరస్తులను గుర్తించేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని పేర్కొన్నారు. భైంసాలో 144 సెక్షన్ ఈ నెల 13 వరకు కొంసాగుతుందని స్పష్టం చేశారు.