కుత్బుల్లాపూర్, డిసెంబర్6: ప్రగతినగర్లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సెన్సార్ కౌన్సిల్ హైదరాబాద్ విభాగం స్థానిక చాప్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూకేలోని గ్లోస్గో విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ నానో ఇంజినీరింగ్ ఆచార్యులు ఐఈఈఈ ప్రెసిడెంట్ ఆచార్య డా.రవీందర్ దహియా ముఖ్యఅతిథిగా హాజరై లార్జ్ ఏరియా ఎలక్ట్రానిక్ స్కిన్ అనే అంశంపై ప్రసంగించారు. బహుళ వైశాల్యం కలిగిన ఎలక్ట్రానిక్ 100 వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని వివరించారు. ఇదే రంగంలో పరిశోధన, అభివృద్ధి విషయంలో వచ్చే సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్వీజేఐఈటీ, శ్రీనిధి, వర్ధమాన్, సీఎంఆర్ కళాశాలలో ఐఈఈఈ విద్యార్థి విభాగాల సహకారంతో ఏర్పాటు చేసిన www.sensorshyd.in వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ విభాగం చైర్పర్సన్ డా.అమిత్కుమార్, సాయికుమార్, కళాశాల సంచాలకులు డా.బి.చెన్నకేశవరావు, డా.వై.పద్మసాయి, వి.ప్రి యాంక, విద్యార్థులు పాల్గొన్నారు.