హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్ యాక్సిస్ డాటాబేస్ ఫ్లాట్ఫారమ్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. సంబంధిత పోర్టల్ను టీసీఐ వ్యవస్థాపక డైరెక్టర్, ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ ప్రభు పింగళి బుధవారం ప్రారంభించారు.
ఈ డాటాబేస్లో ప్రస్తుతం 1966 నుంచి 2017 మధ్య 20 రాష్ట్రాల్లోని 571 జిల్లాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ, పోషకాహారం, ఆరోగ్య సంబంధిత సమాచారం అందుబాటులో వుందని వివరించారు. మొత్తంగా 74 డాటాసెట్లు, 1,030 వేరియబుల్స్, 11 మిలియన్ల కంటే ఎకువ డాటా పాయింట్లు ఉన్నాయని తెలిపారు.