హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్(ఐసీసీఎల్) టోర్నీకి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్న టోర్నీ డిసెంబర్ 7 నుంచి 11 వరకు ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. అంతర్జాతీయ శారీరక వైకల్య దినం(డిసెంబర్ 3) సందర్భంగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డిని ఐసీసీఎల్ క్రికెట్ హెడ్ సంగీత్, శశిధర్రెడ్డి కలిసి అనుమతి తీసుకున్నారు.