హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నవీన్ మిట్టల్.. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతోన్న ఒమర్ జలీల్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. నవీన్ మిట్టల్ ప్రస్తుతం కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కమిషనర్గా కొనసాగుతున్నారు.