చిన్న స్క్రీన్ అయినా, పెద్ద స్క్రీన్ అయినా పాపులారిటీలో టాప్ పొజిషన్ లో ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. ఈ బ్యూటీ చావు కబురు చల్లగా చిత్రంలో పైన పటారం అంటూ ఓ సాంగ్తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ పాటతో కొందరు తనను ఐటమ్గాళ్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అనసూయ. ఐటెంసాంగ్లో ఎందుకు కనిపించారంటూ ఓ ఫాలోవర్ అనసూయను అడిగాడు. దీనికి తనదైన స్టైల్లో సమాధానమిచ్చిందీ తార.
‘ అది ఐటంసాంగ్కాదు. ఐటెంసాంగ్ అనేది ఏది లేదమ్మా. ఒక పాటకు ఉన్న కాస్ట్ కాకుండా స్పెషల్గా ఎవరన్నా కావాలి అనుకున్నపుడు స్పెషల్ సాంగ్ వస్తుంది. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది. ఆ లిరిక్స్ వల్లే నేను ఈ స్పెషల్ సాంగ్ చేశానని క్లారిటీ ఇచ్చింది. తాను ఐటెంగాళ్ను కాదని, స్పెషల్ హీరోయిన్’ ను అని జవాబిచ్చింది.