న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాయు సేన మెరుపు యుద్ధాలకు, స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు సిద్ధంగా ఉండాలని భారత వాయుసేనాధిపతి వీఆర్ చౌదరి పిలుపునిచ్చారు. ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
తూర్పు లఢక్లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను ఆయన ప్రస్తావించారు. ఆకస్మిక ఆపరేషన్ల సమయంలో మానవ వనరులు, సామగ్రిని వేగంగా తరలించే మార్గాలను రూపొందించుకోవాలన్నారు. ఆత్మనిర్భరత సాధించడంలో భాగంగా రక్షణ పరంగా కీలకమైన పరికరాలను స్వదేశంలోనే తయారు చేసుకోవాలని చౌదరి అభిప్రాయపడ్డారు.