కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న గుడ్ బై (Goodbye) అక్టోబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే బిగ్ బీతో పనిచేయడం పట్ల చాలా ఎక్జయిటింగ్గా ఉందంటూ ఇప్పటికే నెట్టింట తన సంతోషాన్ని పంచుకుంది.
అయితే తాజాగా మరోపోస్ట్ పెట్టగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమితాబ్ (Amitabh Bachchan) తో షూట్ లొకేషన్లో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ..’ ఇది జరుగుతుందని..నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా. సార్తో సినిమా పూర్తయింది. అమితాబ్ సార్తో మాట్లాడటం, ఆయనతో ఒకే వేదికను పంచుకోవడం, అదే విషయాల గురించి మాట్లాడటం, ఆయనతో ఫోటో తీసుకోవడం, మై గాడ్..’ అంటూ పోస్ట్లో రాసుకొచ్చింది.
‘ఆయన అద్బుతమైన పర్ఫార్మర్. ఆయనొక రత్నం..ఎప్పుడూ రీల్ పాపా అంటూ నాతో వాదించేవారు..కానీ నా దేవుడు అమితాబ్ బచ్చన్ సార్తో గుడ్ బై సినిమా చేసినందుకు నేనెంతో కృత్పజ్ఞురాలిని. నాకు ఇదొక సంపూర్ణ గౌరవం..ఎప్పటికీ చాలా చాలా ప్రత్యేకమైందంటూ’ తన సంతోషాన్ని మరోసారి అందరితో పంచుకుంది.
రష్మిక మందన్నా మరోవైపు హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను (Mission Majnu) సినిమా చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు రణ్ బీర్కపూర్తో యానిమల్, విజయ్తో వారసుడు సినిమాలు చేస్తుండగా..షూటింగ్ దశలో ఉన్నాయి.
Read Also : Singer Alfaaz | దాబాలో సింగర్పై దాడి..ఇంతకీ జరిగిందంటే..!
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో