బర్మింగ్హామ్: భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇక పరిమిత ఓవర్ల జట్టులోనూ ప్లేస్ పక్కా చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడాలని సిరాజ్ నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న ఈ హైదరాబాదీ.. వార్విక్షైర్ కౌంటీ జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడనున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న మూడు మ్యాచ్ల్లో సిరాజ్ వార్విక్షైర్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.