హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏపై ప్రశంసల వర్షం కురిపించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. లివింగ్ గ్రీన్ కేటగిరి కింద.. ఓఆర్ఓఆర్(ఔటర్ రింగ్ రోడ్డు) చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్(ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో ప్రజెంట్ చేశారు.
ఈ అంతర్జాతీయ అవార్డు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన కారణం. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ మన హైదరాబాద్ నగరం కావడం గమనర్హం.
Many congratulations & very proud of your work @HMDA_Gov @md_hgcl 👏 https://t.co/h8oh1fDOlQ
— KTR (@KTRTRS) October 14, 2022
And #Hyderabad City of Telangana, India has won the #GrandAward and the #livingGreen for #economicRecoveryandInclusiveGrowth organized by #AIPH at #IUCNLeadersForum2022 at #jejuisland #SoProud #BeingIndian pic.twitter.com/L098Hh5OXt
— Sumit Arora (@sumitarorain) October 14, 2022