హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ జిల్లాలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తున్నారని స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత గల జిల్లాగా నమోదైంది. ములుగులో జనసాంద్రత కేవలం 71 కావడం గమనార్హం. రాష్ట్ర జనసాంద్రత 312గా ఉన్నది.
రాష్ట్రంలో రిజిస్టర్డ్ వాహనాలు 2,66,40,147
రాష్ట్రంలో అన్ని రకాల రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య 2,66,40,147కు చేరినట్టు స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ వెల్లడించింది. కరోనా, ఇతర కారణాలతో 2020-21లో వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గాయని పేర్కొన్నది. 2019-20లో రాష్ట్రంలో 23,98,458 వాహన రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2020-21 లో 15,96,736కు పడిపోయింది.