హైదరాబాద్ : తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉత్తర- దక్షిణ దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది.
దీని ప్రభావంతో తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావం కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలపై కనిపించే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.
దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడింది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి