హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్లో భాగంగా ఆదివారం డ్రైరన్ ఉత్సాహంగా సాగింది. ఈనెల 19న జరుగనున్న మారథాన్ సన్నాహాకాల్లో భాగంగా హైదరాబాద్ రన్నర్స్ పీపుల్స్ ప్లాజా వద్ద హాఫ్ మారథాన్ (21.1 కి.మీ), మాదాపూర్లోని హైటెక్స్ గ్రౌండ్ వద్ద 10 కే నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికే సరికొత్త ఆకర్షణ అయిన కేబుల్ బ్రిడ్జిపై పరుగులు తీస్తూ రన్నర్లు ఉత్సాహం కనబర్చారు. దాదాపు 500 మంది రన్నర్లు పాల్గొన్న ఈ డ్రై రన్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది.