హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై సిటీ ఎఫ్సీతో వచ్చే నెల 9న జరిగే తొలి మ్యాచ్ను హెచ్ఎఫ్సీ పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆడనుంది.
వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో ముంబైతో హైదరాబాద్ ఆడాల్సి ఉంది. అయితే స్టేడియంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నందున మ్యాచ్ను హైదరాబాద్ నుంచి పుణెకు మార్చినట్లు హెచ్ఎఫ్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్లో హెచ్ఎఫ్సీ..బెంగళూరు ఎఫ్సీని ఎదుర్కోనుంది.